మోడీ పేరుతో మామిడి పండు.. రుచి, ధర రెండు ఎక్కువే అంటున్న నిపుణులు

by Disha Web Desk 12 |
మోడీ పేరుతో మామిడి పండు.. రుచి, ధర రెండు ఎక్కువే అంటున్న నిపుణులు
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో ప్రధాని మోడీ పేరు మీద ఓ ప్రత్యేకమైన మామిడి పండు మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ మామిడి పండు ప్రత్యేక రుచితో పాటు.. ధర కూడా అధికంగానే ఉండనుంది. అవధ్ ఆమ్ ప్రొడ్యూసర్స్ అండ్ హార్టికల్చర్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ పండు దాసరి, లాంగ్డా, చౌసా మామిడి కంటే చాలా రెట్లు పెద్దదిగా ఉంటుంది. అలాగే. అన్ని రకాల మామిడి పండ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ మోడీ మామిడి వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి రాబోతుంది.

మేము సెంట్రల్ హార్టికల్చర్ ఇనిస్టిట్యూట్‌లో 2019 సంవత్సరంలో విభిన్నమైన మామిడిని పండించాము. దీనికి ల్యాబ్‌లో అన్ని రకాల పరిక్షలు నిర్వహించాక.. ఇది బిన్నమైన, రుచికరమైన పండుగా నిర్ధారించాము. ఇది ఇప్పటి వరకు ఉన్న మామిడిలలో కొత్త రకం పండు. అందుకే దీనికి మేము మోడీ మామిడి అని పేరు పెట్టాము. అలాగే మోడీ మ్యాంగో‌గా పేరును రిజిస్టర్ కూడా చేశామని చెప్పుకొచ్చారు. ఈ పండు రకానికి చెందిన 100 చెట్లను తాము రేడి చేశామని.. త్వరలో మరిన్ని చెట్టను సిద్ధం చేస్తామని.. ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.

Next Story

Most Viewed