Amarnath యాత్రలో దాడికి ఉగ్రవాదుల భారీ కుట్ర

by Disha Web Desk 4 |
Amarnath యాత్రలో దాడికి ఉగ్రవాదుల భారీ కుట్ర
X

దిశ, వెబ్‌డెస్క్: అమర్ నాథ్ యాత్ర టార్గెట్‌గా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఈ కుట్రకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమర్ నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాల సమాచారం. ఇందు కోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు టెర్రరిస్టులు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు యువకుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే అమర్ నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. అగస్టు 31 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది యాత్ర చేపడతారు.


Next Story