యూనివర్శిటీ విద్యార్థుల మధ్య గొడవ.. బాంబు పేలుడు

by Disha Web Desk 12 |
యూనివర్శిటీ విద్యార్థుల మధ్య గొడవ.. బాంబు పేలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: పాట్న యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి అది బాంబు దాడుల వరకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా యూనివర్సిటిలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నాలుగు హస్టళ్లలో ఉన్న విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. అలాగే నాటు బాంబులు సైతం పేల్చుకున్నారు. దీనిని టౌన్ డీఎస్పీ అశోక్ కుమార్ సింగ్ 'ఇగో క్లాష్'గా తెల్చారు. ఈ గొడవల్లో మొత్తం ఆరుగురు విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు.


Next Story