- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లగ్జరీ హోటల్లో రాసలీలలు... మంత్రులతోసహా సీనియర్ అధికారుల బాగోతం.. మహిళ ఫిర్యాదుతో సంచలనం
మహారాష్ట్ర నాసిక్లోని ఓ లగ్జరీ హోటల్ చుట్టూ హనీ ట్రాప్ స్కామ్ నడుస్తోంది. మాజీ మంత్రులతో సహా 72 మంది సీనియర్ అధికారులు ఈ కుంభకోణంలో చిక్కుకున్నట్లు ఓ రాజకీయ నాయకుడు ఓపెన్గా కామెంట్ చేశాడు. ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదుతో

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర నాసిక్లోని ఓ లగ్జరీ హోటల్ చుట్టూ హనీ ట్రాప్ స్కామ్ నడుస్తోంది. మాజీ మంత్రులతో సహా 72 మంది సీనియర్ అధికారులు ఈ కుంభకోణంలో చిక్కుకున్నట్లు ఓ రాజకీయ నాయకుడు ఓపెన్గా కామెంట్ చేశాడు. ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదుతో ఇది నిజమేనని తేలింది. నాసిక్, ముంబై, పూణే, థానే వంటి నగరాల్లో ఒక మహిళ అధికారులను బ్లాక్మెయిల్ చేయడానికి తప్పుడు అత్యాచార ఆరోపణలు, దాచిన కెమెరాలను ఉపయోగించిందని తెలుస్తోంది. దీని వెనుక నాసిక్లోని ఒక ప్రముఖ రాజకీయ పార్టీ మాజీ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నారు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ (SID) ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నారు. అయితే SID రహస్యంగా దర్యాప్తు చేస్తూ ఉండవచ్చని.. ఎందుకంటే ఇటువంటి కేసులు జాగ్రత్తగా మేనేజ్ చేయడం, సాక్ష్యాలను ధృవీకరించడం, సున్నితమైన సమాచారాన్ని రాజీ చేయకుండా ఉండటం అవసరం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇక ముంబై నాకా పోలీస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. సీనియర్ అధికారులు, మాజీ మంత్రులు బ్లాక్ మెయిల్కు గురయ్యే పరిస్థితి.. ప్రజలలో పరిపాలనపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.






