Bus Accident: ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ఏడుగురు మృతి

by Prasad Jukanti |   (  Updated:2025-12-30 06:32:29  IST  )

న్యూ ఇయర్ సమీపిస్తున్న వేళ తీవ్ర విషాదం నెలకొంది.

Bus Accident: ఘోర  ప్రమాదం..  బస్సు లోయలోపడి ఏడుగురు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‍లోని అల్మోరా జిల్లా (Almora district) భికియాసైన్ వద్ద బస్సు లోయలో (Uttarakhand bus accident) పడిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు భికియాసైన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (CM Pushkar Singh Dhami) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం తెలిపారు.

Read More..

రైలులో దారుణం.. గంజాయి మత్తులో యువకుడిపై కత్తులతో దాడి చేసిన నలుగురు మైనర్లు

Next Story