మధ్యాహ్నం 1 గంట వరకు 37.25 శాతమే పోలింగ్

by Dishafeatures2 |
మధ్యాహ్నం 1 గంట వరకు 37.25 శాతమే పోలింగ్
X

దిశ, డైనమిక్: కర్ణాటక ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకూ 37.25 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ సాయంత్రం వరకూ 6 గంటలకు జరగనున్న పోలింగ్‌పై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు. ప్రజలు పోలింగ్ బూత్‌లకు చేరుకుని ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.

కాగా కర్ణాటక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 224 నియోజకవర్గాల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. బీజేపీ సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాధ్ ఓటు వేశారు.


Next Story

Most Viewed