సినిమా తరహాలో గ్రామంపై దుండగుల కాల్పులు.. 37 మంది మృతి

by Gantepaka Srikanth |

ఉత్తర నైజీరియాలో దారుణం జరిగింది.

సినిమా తరహాలో గ్రామంపై దుండగుల కాల్పులు.. 37 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర నైజీరియా(Northern Nigeria)లో దారుణం జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు కుసువాన్ - డాజి అనే గ్రామంపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. ఇళ్లకు నిప్పుపెట్టారు. దుండగుల దాడిలో 39 మంది గ్రామస్తులు(37 Villagers Dead) మృతిచెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. కాగా, నైజీరియా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ అనేక మారుమూల ప్రాంతాలలో భద్రత బలహీనంగా ఉంది. నేరస్థుల ముఠాలు, సాయుధ నేరస్థులు ఈ ప్రాంతాలలో పనిచేస్తున్నారు. ఈ ముఠాలు తరచుగా గ్రామాలపై దాడి చేస్తాయి. ప్రజలను హత్య చేస్తారు. తరచూ చిన్నారులను కిడ్నాప్‌లకు పాల్పడుతుంటారు. పోలీసుల కథనం ప్రకారం, కసువాన్-డాజిపై దాడి చేసిన సాయుధ వ్యక్తులు నేషనల్ పార్క్ ఫారెస్ట్, కాబే జిల్లా నుండి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలు విస్తారమైన, వివిక్త అడవులు ఉన్నాయి. ఇవి తరచుగా సాయుధ ముఠాలకు దాక్కునే ప్రదేశాలుగా మారాయని.. ఈ క్రమంలోనే దాడి చేయడానికి సులువు అయిందని సమాచారం. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story