- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
J&K: లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం
by S Gopi |
జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున ఆర్మీ వాహనం లోయలో దొర్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో భారత ఆర్మీ వాహనం లోయలో పడి ముగ్గురు సైనికులు మరణించారు. మృతుల్లో అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్గా గుర్తించినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున ఆర్మీ వాహనం బ్యాటరీ చష్మా సమీపంలో 700 అడుగుల లోతు ఉన్న లోయలో దొర్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలో సైనికులతో పాటు వారి వస్తువులు చెల్లచెదురుగా పడిపోయాయి. ఆదివారం ఉదయం 11.30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా, భారత సైన్యంతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సేవకులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.
Next Story






