- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టూ వీలర్ ట్యాక్సీలు బంద్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశ రాజధాని ఢిల్లీలో టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులను బంద్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులను బంద్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే తమ ఆదేశాలు జూన్ 30 వరకు అమలులో ఉంటాయని, ఈ లోగా ర్యాపిడో, ఊబర్ వంటి టూ వీలర్ ట్యాక్సీల సర్వీసులకు సంబంధించిన సమగ్ర పాలసీని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా అంతకుముందు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని టీ వీలర్ ట్యాక్సీలను హెచ్చరిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ర్యాపిడో సంస్థ కోర్టులో సవాలు చేసింది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులను రద్దు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడం గమనార్హం.
Next Story






