హైవేలపై ప్రమాదాలు.. 6 నెలల్లో 27 వేలమంది మృతి : మంత్రి గడ్కరీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-23 15:14:55  IST  )

హైవేలపై ప్రమాదాలు.. 6 నెలల్లో 27 వేలమంది మృతి : మంత్రి గడ్కరీ
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న హైవేలపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 27 వేల మంది మరణించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెల్లడించారు. ఈ ఏడాది జనవరి - జూన్ మధ్యకాలంలో మరణాలు నమోదైనట్లు తెలిపారు. బుధవారం జరిగిన రాజ్యసభలో.. సభ్యులు రోడ్డుప్రమాదాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను పేర్కొన్నారు. హైవేలపై జరిగిన ప్రమాదాల్లో గడిచిన ఆర్నెలల్లో 26,770 మంది మృతి చెందగా.. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 52,609 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

ఢిల్లీ - మీరఠ్ ఎక్స్ ప్రెస్ వే, ట్రాన్స్ - హరియాణా, ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ వే వంటి హై ట్రాఫిక్ ఏరియాల్లో NHAI అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. గడిచిన మూడేళ్లలో 1,12,561 కిలోమీటర్ల జాతీయ రహదారులకు రోడ్డు భద్రతా ఆడిట్ నిర్వహించామని కూడా వివరించారు.

Next Story