గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం

by Disha Web Desk 2 |
గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2002 నాటి నారోదాగామ్ అల్లర్లలో 11 మంది చనిపోయిన కేసులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, బజరంగ్ దళ్ మాజీ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 69 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో నిందితులందరూ ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ కేసులో మొత్తం 87 మంది నిందితుల్లో 18 మంది ఈ మధ్య కాలంలో మరణించారు. విచారణ సందర్భంగా దాదాపు 182 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు.



Next Story

Most Viewed