- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
200 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. తమిళనాడు, హైదరాబాద్లలో ఈడీ రైడ్స్
00 కోట్ల బ్యాంకు మోసం కేసులో భాగంగా ఈ రోజు తమిళనాడు, హైదరాబాద్లలో ఈడీ రైడ్స్ జరిగాయి.

దిశ, వెబ్డెస్క్: 200 కోట్ల బ్యాంకు మోసం కేసులో భాగంగా ఈ రోజు తమిళనాడు, హైదరాబాద్లలో ఈడీ దాడులు (Eddy raids) జరిగాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత (Late Chief Minister Jayalalithaa) సన్నిహితురాలు శశికళ (Sasikala,), మరికొందరిపై జరిగిన రూ.200 కోట్ల బ్యాంకు మోసం (200 crore bank fraud), బినామీ ఆస్తుల దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఈ సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. మార్గ్ గ్రూప్ (Marg Group)తో సంబంధం ఉన్న, శశికళ బినామీగా చెప్పబడుతున్న జిఆర్కె రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి రెండు నగరాల్లో ఉన్న కనీసం పది స్థలాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (Anti-Money Laundering Act) (పిఎంఎల్ఎ) నిబంధనల కింద దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దర్యాప్తు రూ.200 కోట్ల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించినదని, దీనిపై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు కీలక నగరాల్లో ఈడీ చేసిన సోదాలపై మాత్రం అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు.






