- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad Agro Company: ఒడిశాలో పేడ పిడకల కింద రూ. 20 లక్షలు
by Mahesh Kanagandla |
హైదరాబాద్లోని ఓ ఆగ్రో కంపెనీ లాకర్ నుంచి రూ. 20 లక్షలు దొంగిలించి ఒడిశాకు తరలించారు. హైదరాబాద్, ఒడిశా పోలీసులు ఈ డబ్బును ఒడిశాలోని ఓ గ్రామంలో పేడ పిడకల కింద గుర్తించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్లోని ఓ ఆగ్రో కంపెనీ(Hyderabad Agro Company) లాకర్ నుంచి రూ. 20 లక్షలు దొంగిలించి ఒడిశా(Odisha)కు తరలించారు. హైదరాబాద్, ఒడిశాల పోలీసులు ఈ డబ్బును ఒడిశాలోని ఓ గ్రామంలో పేడ పిడకల(Cow Dung) కింద గుర్తించారు. ఆగ్రో కంపెనీలో గోపాల్ బెహెరా పని చేశాడు. ఆ సమయంలో కంపెనీ లాకర్ నుంచి రూ. 20 లక్షలు చోరీ చేసి బావమరిది రబీంద్ర బెహెరాతో ఒడిశాకు తరలించాడు. బాలాసోర్ జిల్లా బడామందారుని గ్రామంలో పేడ పిడకల కింద ఈ డబ్బును దాచిపెట్టారు. చోరీపై ఫిర్యాదు అందడంతో హైదరాబాద్ పోలీసులు ఒడిశాలోని కామర్దా పోలీసులతో కలిసి రబీంద్ర బెహెరా ఇంటిపై రెయిడ్ చేశారు. పేడ పిడకల కింద డబ్బుల కట్టలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గోపాల్, రబీంద్రలు పరారీలో ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న వారి కుటుంబ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






