- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మీ హెలికాప్టర్ చీతా శిథిలాల గుర్తింపు.. ఇద్దరు పైలెట్లు మృతి
by Harish |
అరుణాచల్ ప్రదేశ్లో మండాలాలో ఆర్మీ హెలికాప్టర్ చీతా గురువారం ఉదయం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

X
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో మండాలాలో ఆర్మీ హెలికాప్టర్ చీతా గురువారం ఉదయం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే మండాలాకు తూర్పుగా ఉన్న బంగ్లాజాప్ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ శిథిలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించినట్లు వెల్లడించారు. గురువారం ఉదయం 9.15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి హెలికాప్టర్ కాంటాక్ట్ కోల్పోయింది. దీంతో టిబెటియన్ బార్డర్ పోలీసులు(ఐటీబీపీ) గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు వారు చెప్పారు.
Next Story






