- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఆలయంలో తొక్కిసటాల..ఇద్దరు మృతి
ఉత్తరాఖండ్ మాససా దేవి ఆలయంలో తొక్కిసలాట మర్చిపోకముందే దేశంలో మరో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ మాససా దేవి ఆలయంలో తొక్కిసలాట మర్చిపోకముందే దేశంలో మరో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరికొందిరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. యూపీలోని బారాబంకీలోని ఓ ఆలయంలో విద్యుత్ తీగ తెగిపడింది. ఆలయంలోకి కొన్ని కోతులు ప్రవేశించగా అందులో ఓ కోతి విద్యుత్ తీగను పట్టుకుని లాగటంతో అది తెగిపడినట్టు తెలుస్తోంది. దీంతో భక్తులంతా ఒక్కసారిగా ఆందోళన చెంది పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగటంతో ఇద్దరు మృతి చెందగా నలభై మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది.
Next Story






