మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..

by Disha Web Desk 12 |
మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం రోజు 10,753 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం మళ్లీ 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం భారతదేశంలో COVID-19 యాక్టివ్ కేసుల సంఖ్య 57,542కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 23 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,31,114కి పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story

Most Viewed