7లక్షల మార్క్‌ను దాటేసిన భారత్

by  |
7లక్షల మార్క్‌ను దాటేసిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా డెంజర్ బెల్స్ మోగిస్తున్నది. భారత్‌లో 7,19,665 మంది కరోనా బారిన పడ్డారు.కేవలం 24గంటలలోనే 22,252 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా, 467మంది వైరస్‌తో పోరాడి మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి 20,160 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, కరోనాతో పోరాడి గెలిచి 4,39,948 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో భారత్‌ 7లక్షల పాజిటివ్ కేసులతో రష్యాను వెనక్కి నెట్టి ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.



Next Story

Most Viewed