ఆ కేసు రీ ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్

by  |
ఆ కేసు రీ ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రెండు రాష్ట్రాలు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే, దీనికి సంబంధించిన కేసును రీ ఓపెన్ చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అంగీకారం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తును స్వీకరించిన ఎన్జీటీ.. తీర్పును కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా వేసింది. దీంతో ఈ వ్యవహారం ఇరు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story