అవినీతి ఆరోపణలు.. నార్సింగి సీఐ, ఎస్ఐపై సస్సెన్షన్ వేటు

by  |
CP Stephen Ravindra
X

దిశ, గండిపేట్: భూ వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నార్సింగి సీఐ గంగాధర్, ఎస్‌ లక్షణ్‌పై సస్పెన్షన్ వేటుపడింది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్ మెంట్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరిని విధులను నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనారు.

గతంలోనూ వీరిద్దరు భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. నార్సింగి సీఐ గంగాధర్‌పై ఉన్న పలు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్సింగి మాజీ ఎంపీటీసీ సాయిరామ్ ముదిరాజ్, కుటుంబ సభ్యులను భూ వివాదంలో ఇబ్బందులకు గురి చేశారని గతంలో తీన్మార్ మల్లన్నకు సైతం ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటన నేపథ్యంలో సీఐ, ఎస్ఐ‌పై వేటు పడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed