బ్లాక్ ఫంగస్‌తో సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి మృతి

by  |
బ్లాక్ ఫంగస్‌తో సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి మృతి
X

దిశ, నార్కట్ పల్లి: నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం సింగిల్ విండో చైర్మన్ గంట నర్సిరెడ్డి (55) సోమవారం బ్లాక్ ఫంగస్ తో మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సిరెడ్డి గత నెల కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం నెగిటివ్ రిపోర్ట్ వచ్చాక ఊపిరి పీల్చుకునే సమయంలోనే బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వైరస్ సోకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి లో అడ్మిట్ అయ్యారు.

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందారు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకునిగా మండలంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణవార్త విన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి లు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు..

Next Story

Most Viewed