రాష్ట్రపతితో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ

by  |
రాష్ట్రపతితో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో శుక్రవారం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాలపాటు రాష్ట్రపతితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో తాజా పరిస్థితులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో తనపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. నియోజక వర్గానికి వెళ్లలేని స్థితిని, దాడులు చేస్తామని చేసిన బెదిరింపులను రాష్ట్రపతికి వివరించినట్టు తెలిపారు. పోలీసు కేసులతో అన్యాయంగా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. తన ఫిర్యాదును కేంద్ర హోం మంత్రికి పంపిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారన్నారు.

త్వరలో రాష్ట్రపతి సూచన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గతంలో ఎన్నికలు వద్దని రాద్ధాంతం చేసిన తమ పార్టీ నేతలు, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డపై ఒత్తిడి తీసుకురావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమం, నిమ్మగడ్డ తన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కోరినట్లు తెలిపారు. అయితే అఖిలపక్షంలో ఉండే వారిని ఇంకా ఖరారు చేయలేదన్నారు. తనకు కేంద్ర హోం మంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించే విషయంపై రాష్ట్రపతి కార్యాలయం ఫాలో ఆప్ చేస్తుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

Next Story