జగన్ భజన ప్రియుడు: ఎంపీ రఘురామకృష్ణంరాజు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నేతలు భజన చేస్తున్నారంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జగన్ భజన ప్రియుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన భగవంతుడు భజన ప్రియుడని, భజన ప్రియత్వం వలన జగన్ మామూలు మనిషి అయినప్పటికీ.. తనను తాను భగవంతునిగా భావించుకుంటున్నాడని ఆరోపించారు. భజన చేసేవాళ్లనే జగన్ చేరదీస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ భజన చేసేవాళ్లకే ఉన్నత పదవులు [&hellip;]</p>

MP Raghurama krishnamraju
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు నేతలు భజన చేస్తున్నారంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జగన్ భజన ప్రియుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన భగవంతుడు భజన ప్రియుడని, భజన ప్రియత్వం వలన జగన్ మామూలు మనిషి అయినప్పటికీ.. తనను తాను భగవంతునిగా భావించుకుంటున్నాడని ఆరోపించారు. భజన చేసేవాళ్లనే జగన్ చేరదీస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ భజన చేసేవాళ్లకే ఉన్నత పదవులు కట్టబెడుతున్నారంటూ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

Next Story