‘ఆ రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలి’

by  |
‘ఆ రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన అజయ్ భల్లాతో మాట్లాడుతూ… ‘రాజధానిని తరలించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరు తెచ్చారు.

అమరావతి రైతుల త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని కోరాను. అటార్నీ జనరల్ న్యాయ సలహాతో అఫిడవిట్టు వేయాలని చెప్పాం. అన్ని అంశాలను పరిశీలిస్తామని అజయ్ భల్లా చెప్పారు. అమరావతియే ఏకైక రాజధానిగా ఉంటుందన్న నమ్మకం ఉంది’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also..

సెటిల్‌మెంట్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు !



Next Story