పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయాలి : తమ్మినేని

by  |
పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయాలి : తమ్మినేని
X

దిశ, అమరావతి బ్యూరో: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నర్సాపురం ఎంపీ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు కావాలనే విమర్శలు చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయాలి కానీ, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. అనంతరం ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం మంచి పద్దతి కాదని ఎస్‌ఈ‌సీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. సూచనలు చేయాల్సిన వారు, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఒక్కరి నిర్ణయం వల్లే స్థానిక ఎన్నికలు ఆగిపోయాయని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.


Next Story