మొహంలో మిక్సైన మంత్రి మాస్క్!

by  |
మొహంలో మిక్సైన మంత్రి మాస్క్!
X

భోపాల్: ఆ మంత్రి పెట్టుకున్న మాస్కు అతని మొహంలో కలిసిపోయింది. మాస్కు పెట్టుకోకుంటే ఎలా కనిపిస్తుందో.. మాస్కు పెట్టుకున్నాక కూడా అలానే కనిపిస్తోంది. కరోనా కట్టిడికి మాస్కు తప్పనిసరి. అలా అని తమ మొహం దాచకోకుండా అందరికీ చూపించాలనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా మాస్కును తయారు చేయించాడు. దీంతో అది పెట్టుకున్నాక కూడా ముక్కు, మీసాలు, గడ్డం కనిపిస్తోంది. అదిచూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆయన మరెవరో కాదు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా.

తన ముఖానికి సరిపోయేలా ముక్కు, మీసాలు, పెదవులు సరిగ్గా అతికేలా ఉండేలా మాస్కులను తయారుచేయించారు. మాస్కు రంగు కూడా తన చర్మం రంగులో ఉండేలా చూసుకున్నారు. ఇంకేం ఈయన మాస్కు పెట్టుకున్నా లేనట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ముక్కు, పెదవులు, మీసాలు అన్ని కనిపిస్తున్నాయి. ఈయన ఎక్కడికి వెళ్లినా ఆయనను కలువడం కన్నా ఆయన ధరించే మాస్కును చూసేందుకే కార్యకర్తలు ఎగబడుతున్నారు. సోమవారం తన సొంతూరుకు వచ్చిన నరొత్తం మిశ్రాకు కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రావడంతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలాఉండగా, నరోత్తం మిశ్రా గత నెలలోనే హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


Next Story

Most Viewed