ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మాదే

by  |
ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మాదే
X

దిశ, నారాయణఖేడ్: దుబ్బాక నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్ పార్టీదే అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో ప్రచారం చేయనున్నట్టు వివరించారు.

ఈ మేరకు తనకు నార్సింగి మండలాన్ని ప్రచారం కోసం కేటాయించారని వివరించారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డి గతంలో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో తన గెలుపు కోసం నారాయణఖేడ్ పట్టణంలో ఉండి విశేష ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను నార్సింగి మండలంలో ప్రచారం నిర్వహించి పార్టీ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed