తప్పని పరిస్థితుల్లో అలా అడిగా: ఎంపీ

by  |
తప్పని పరిస్థితుల్లో అలా అడిగా: ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: తనకు భద్రత కల్పించాలని, నేను తప్పని పరిస్థితుల్లో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు తనపై కేసులు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని ఆయన తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రత అడిగానని, కేంద్రం భద్రత కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. గత కొన్నాళ్లుగా పార్టీ అంతర్గత కలహాల కారణంగా నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ధ్వజమెత్తారు. ఈ విషయమై పార్టీ అధినాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. ఇందుకు ఆయన ధీటుగా స్పందించాడు. అంతేకాదు అనేక అంశాలను లేవనెత్తి పార్టీని ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed