- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: ‘విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు’ అని నినదిద్దామని పిలుపునిచ్చారు యంగ్ హీరో నారా రోహిత్. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. ఆంధ్రులు 22వేల ఎకరాలు రాసిచ్చారన్నారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారని.. 32 మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉక్కు కర్మాగారం ఉనికే ప్రమాదంలో పడుతోందని.. ‘ఆంధ్రుడా మేలుకో’ అంటూ పిలుపునిచ్చారు. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న పరిశ్రమ, 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడటం బాధ కలిగించే విషయమన్న రోహిత్.. 50ఏళ్లకు పైబడిగా కార్మికులు తమ శ్రమ, శ్వేదంతో అభివృద్ధి చేసిన కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడమే మనం సాధించిన అభివృద్ధా? అని ప్రశ్నించారు.
కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు.(1/3)
— Rohith Nara (@IamRohithNara) February 21, 2021