- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సోమవారం లేఖ రాశారు. అఖిల భారత చేనేత బోర్డును రద్దు చేసిన నేపథ్యంలో ఆ రంగాన్ని కాపాడుకోవడానికి కేంద్రం సాయం కోరాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. అయితే కరోనా కారణంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. కేంద్రం మూడు బోర్డులను రద్దు చేయడంతో చేనేత, హస్తకళాకారుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఈ రంగాల పునరుద్ధరణకు ఇప్పటికే కేంద్రానికి నా వంతుగా లేఖ రాశానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం అని లేఖలో పేర్కొన్నారు.
Read Also…
Next Story