కర్నూలులో కరోనా బాధితుల ఆందోళన.. నారా లోకేశ్ ట్వీట్

by  |
కర్నూలులో కరోనా బాధితుల ఆందోళన.. నారా లోకేశ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని.. వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితి ఉందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో భోజనం పెట్టండి మహాప్రభో అంటూ ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లలో కరోనా రోగులు పడుతున్న బాధలు చూస్తుంటే బాధేస్తుందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ కొనుగోలు పేరుతో కోట్లు మింగారని ఆరోపించారు. ఇప్పుడు రోగులకు ఇచ్చే భోజనాన్ని కూడా జగన్ అనుచర గణం వదలడం లేదంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ రోజు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఎదుట కరోనా పేషంట్లు సమయానికి భోజనం అందించండి అంటూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరైన సమయానికి కనీసం టిఫిన్ కూడా అందజేయడం లేదని కరోనా పేషంట్లు ఆరోపించడం గమనార్హం.


Next Story