వారి మృతికి నా సంతాపం: నారా లోకేశ్

by  |
వారి మృతికి నా సంతాపం: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన పై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారి పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.‘శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరం. మంటల్లో చిక్కుకొని ఏఈ సుందర్‍నాయక్‍ తో పాటు మరో ఐదుగురు చనిపోవడం బాధాకరం. వారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో చిక్కుకున్న ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్లో వారు క్షేమంగా బయటకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Next Story