‘ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట’

by  |
‘ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత నారాలోకేశ్ సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరూ జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు తొలగించారన్నారు. ఆ సమయంలో వారిని అడ్డుకున్న ఐదుగురు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బాధిత నాయకులతో మాట్లాడి.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.



Next Story