సీఎం జగన్, 41 మంది ఎమ్మెల్యేలు చిప్పకూడు తినడం ఖాయం

by  |
సీఎం జగన్, 41 మంది ఎమ్మెల్యేలు చిప్పకూడు తినడం ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం జగన్ తలపెట్టిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకది సెంటు స్థలం, వైసీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ రూ.6,500 కోట్లని విమర్శించారు. ఈ ఆధారాలతోనే జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయం అంటూ నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ కేసుల వల్లే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామన్న సీఎం జగన్ .., మరి ఇప్పుడెలా ఇస్తున్నారని ప్రశ్నించారు. అందుకే నిన్ను ఫేక్ సీఎం అనేది. టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రానా సైకిల్ బ్రాండ్ చేరిగిపోదు. నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని నారాలోకేష్ విమర్శించారు.

Next Story

Most Viewed