వైసీపీ కాదు.. వాళ్లది జేసీబీ ప్రభుత్వం : నారా లోకేష్

by  |
nara lokesh
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాలోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. గురువారం తిరుపతిలోని వెంకటగిరిలో ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే దమ్ము లేదని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో ఏ-1ముద్దాయిగా ఉన్నాడని, అధికార పార్టీ మరో ఎంపీ ఏ-2గా ఉన్నాడని గుర్తుచేశారు. ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వానికి నారాలోకేష్ కొత్త అర్థాన్ని చెప్పారు. ఏపీలో నడిచేది ‘వైసీపీ ప్రభుత్వం కాదు.. జేసీబీ ప్రభుత్వం’ నడుస్తోందన్నారు. జేసీబీ అంటే ‘జగన్ బాదుడు సర్వీస్’ అని వెల్లడించారు.


Next Story

Most Viewed