చెత్తబండిలో సర్కార్ దవాఖానాకా?

by  |
చెత్తబండిలో సర్కార్ దవాఖానాకా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఓటేసిన పేదలు అనారోగ్యానికి గురైతే చెత్త‌బండిలో ఏపీ స‌ర్కారు ద‌వాఖానాకా అంటూ టీడీపీ నేత నారాలోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ‌ద్దెనెక్కిన పెద్దలకి మాత్రం కరోనా సోకితే ప్ర‌త్యేక విమానంలో ప‌క్క‌రాష్ట్రాల కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కా అంటూ నిలదీశారు. ఇదెక్కడి న్యాయం, ఇదేం పాలన అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో అంబులెన్స్ కి కాల్ చేసినా స్పందన లేకపోవడంతో చెత్తబండిలో అనారోగ్యానికి గురైన వ్యక్తిని తరలించడం బాధకరమన్నారు. పబ్లిసిటీ అంబులెన్స్ అయితే రియాలిటీ చెత్త బండి అయ్యిందంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

Next Story

Most Viewed