ఇది జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం : లోకేష్

by  |
ఇది జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం : లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఏం జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విద్యార్థుల పాలిట జగన్ కంసుడిగా రుజువైందని విమర్శలు చేశారు. దేశంలో కరోనా విజృంభన కారణంగా పరీక్షలు వాయిదా వేస్తుంటే, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామనడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో కరోనాతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే విద్యార్థుల భవిష్యత్తు అంటూ ప్రసంగాలు ఇస్తున్నారని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు దొరకక రోగులు మరణిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 15 లక్షల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫ్యాక్షన్ సీఏం జగన్ ఆలోచన మార్చుకోవాలని లోకేష్ అన్నారు.



Next Story