హల్దీ ఫంక్షన్‌లో మెరిసిపోతున్న నమ్రత

by  |
హల్దీ ఫంక్షన్‌లో మెరిసిపోతున్న నమ్రత
X

మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ పెండ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. వంశీ సినిమా సమయం(2000)లో మహేశ్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత .. ఐదేండ్ల డేటింగ్ తర్వాత ప్రిన్స్‌‌ను పెండ్లి చేసుకుంది. ఫిబ్రవరి 10, 2005న మహేశ్, నమ్రత మూడు ముళ్ల బంధంతో ఏకమై.. టాలీవుడ్ బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న నమ్రత.. ఓ అందమైన ఫొటో షేర్ చేసింది. మహేశ్, నమ్రతల పెండ్లి తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. మ్యారేజ్‌కు ముందు రోజు హల్దీ ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరగగా.. ఈ కార్యక్రమం నుంచి తన ఫొటో షేర్ చేసింది. మొహంపై పసుపు, పెండ్లి కళతో ఈ ఫొటోలో మెరిసిపోతున్న నమ్రత.. పెండ్లి రోజు కోసం వేచి చూస్తున్నట్లు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో చూసిన బంధుమిత్రులు, అభిమానులు ఎంత అందంగా కనబడుతుందో అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

https://www.instagram.com/p/CCvQkPlj0vA/?utm_source=ig_web_copy_link


Next Story

Most Viewed