నామ ముత్త‌య్య ట్ర‌స్టు భారీ విరాళం

by  |
నామ ముత్త‌య్య ట్ర‌స్టు భారీ విరాళం
X

దిశ‌, ఖమ్మం: క‌రోనా నివార‌ణ‌ చ‌ర్య‌ల్లో భాగంగా నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్, మధుకాన్ షుగర్స్ భారీ విరాళం ప్రకటించింది. శుక్రవారం క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌కు మంత్రి అజ‌య్‌కుమార్ చేతుల మీదుగా ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు శానిటైజర్, మాస్కులను అంద‌జేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు 25 వేల లీటర్ల శానిటైజర్, 3 లక్షల మాస్కుల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అజ‌య్ మాట్లాడుతూ క‌ష్ట‌కాలంలో సామాజిక సేవతో నామ ముత్త‌య్య మెమోరియ‌ల్ ట్రస్ట్ శానిటైజ‌ర్‌, మాస్కుల‌ను అంద‌జేసేందుకు ముందుకు రావ‌డం గొప్ప విష‌యమ‌ని కొనియాడారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో పాలుపంచుకుంటున్న జిల్లా సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌కు మంత్రి ఆదేశించారు.

tag: Nama Muthiah, Trust, huge donation, corona Prevention, khammam


Next Story

Most Viewed