‘భద్రత’తో పోలీస్ కుటుంబాల్లో వెలుగులు: ఎస్పీ రంగనాథ్

by  |
‘భద్రత’తో పోలీస్ కుటుంబాల్లో వెలుగులు: ఎస్పీ రంగనాథ్
X

దిశ, నల్గొండ: భద్రత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతోందని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ సతీమణి స్వరూపారాణి కుటుంబానికి శనివారం ఎస్పీ నాలుగు లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భద్రత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతోందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ గౌడ్, నాయకులు సోమయ్య, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అక్షయ్ కుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story