- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: చేయూత పథకం పోలీసు కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన కట్టంగూరు ఏఎస్ఐ ఎస్. వెంకన్న, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. మల్లేశం కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున చేయూత పథకం కింద ఎస్పీ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు. చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, వెల్ఫేర్ ఆర్ఐ నర్సింహాచారి తదితరులున్నారు.