‘రైతులకు రుణాలిచ్చి ఆదుకుంటాం’

by  |
‘రైతులకు రుణాలిచ్చి ఆదుకుంటాం’
X

దిశ, నల్లగొండ: సింగిల్ విండో సొసైటీల ద్వారా రైతులకు రుణాలు అందజేస్తామని నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆయన వివిధ బ్యాంకుల సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అభివృద్ధి చెందాలని ఒక్కొక్క సొసైటీకి సీఎం కేసీఆర్ యాభై లక్షల చొప్పున నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులను స్వల్పకాలిక రుణాల కిందకు రైతులకు మంజూరు చేయాలన్నారు. పాత బకాయిలను రికవరీ చేసి సొసైటీలను అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, జీసీవో, చౌటుప్పల్ డివిజన్ పీఏసీఎస్ చైర్మన్, వివిధ సంఘాల చైర్మన్లు, సెక్రటరీలు, కోపరేటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.



Next Story