- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల ఆరంభంలో సోషల్ మీడియాలో అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా సీఐడీ పోలీసులు వేకువ జామునే అదుపులోకి తీసుకుని, మరుసటి రోజు విడిచిపెట్టిన నలంద కిశోర్ మృతి చెందడం వైజాగ్లో కలకలం రేపుతోంది. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడైన నలంద కిశోర్.. మూడు వారాల క్రితం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను షేర్ చేశారు. దీంతో గంటా సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనను లోనికి అనుమతించని సంగతి తెలిసిందే.
ఆ సమయంలో నలంద కిశోర్ని వైజాగ్ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చి, విచారించి విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు చెబుతున్నారు. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం ప్రాణాలు విడిచారు. అయితే ఆయన కేవలం జ్వరంతోనే చనిపోయారా? సుదూర ప్రయాణంలో పోలీసులు ఏమైనా చేశారా? ఆయనది సాధారణ మరణమా? లేక సాధారణ మరణంగా చిత్రీకరించిన హత్యా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.