ఓటేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్

by  |
TRS candidate Nomula Bhagat
X

దిశ, హాలియా: నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కరోనా నిబంధనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనుముల మండల పరిధిలోని ఇబ్రహీంపేట పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కుటుంబం సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భవాని, తల్లి నోముల లక్ష్మీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్‌లతో కలిసి వినియోగించుకున్నారు. కాగా, నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా, మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ సెంటర్‌ వద్ద థర్మల్‌ స్కానింగ్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.



Next Story

Most Viewed