- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కర్మకు మెనూ లేదని, గతంలో చేసిన దారుణాలకు టీడీపీ అనుభవిస్తోందని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకురాలిని సోషల్ మీడియాలో ఏదో అన్నారని మా జనసేన కార్యకర్తలను దొంగ కేసులతో అరెస్ట్ చేసి, వాళ్లను గొడ్లను బాదినట్లు బాదారు. అంత హింస పెట్టిన టీడీపీ ఇప్పుడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అంత గగ్గోలు పెడుతున్నాయి. వాళ్లు కేవలం కార్యకర్తలే, నాయకులు కాదనేగా మీ ఉద్దేశం. కర్మకు మెనూ లేదు. ఫలితాన్ని అనుభవిస్తారు. మా కార్యకర్తలను కొట్టించిన పాపం అంత తేలిగ్గా పోతుందా? జనసైనికుల పట్ల మీరు ప్రవర్తించిన తీరును మేము ఎన్నటికీ మర్చిపోము’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story