ఓటర్లపై నాగబాబు ఫైర్.. ఏమనంటే ?

by  |
ఓటర్లపై నాగబాబు ఫైర్.. ఏమనంటే ?
X

దిశ, ఏపీ బ్యూరో: ఓటర్లపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఫైరయ్యారు. ఎన్నికల్లో ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండిపోయిన వారిని, డబ్బు తీసుకుని ఓటు వేసిన వారిని ట్విట్టర్ మాధ్యమంగా విమర్శిస్తూ, ‘కష్ట సమయంలో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40 శాతం ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు’ అని ఆయన విమర్శించారు.

‘రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు’ అని నాగబాబు మరో ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.

Next Story

Most Viewed