- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చార్మినార్: ప్రముఖ సినీనటుడు కొణిదెల నాగబాబు మంగళవారం జూ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అరుదైన సెనెగెల్ చిలుకల జంట కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 35 వేల చెక్కును జూ క్యూరేటర్కు నాగబాబు అందజేశారు. అనంతరం జూపార్కును శ్రద్దగా తిలకించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, జూపార్కులోని అరుదైన వెస్టన్ ఆఫ్రికాలో మాత్రమే కనిపించే సెగెనెల్ చిలుకల జంటను జూకు బహుకరించాలని నిర్ణయించుకున్నామని, ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన డబ్బును తన సోదరి విజయ తరపున జూపార్కు క్యూరేటర్కు అందజేశామన్నారు.
క్యూరేటర్ వీవీఎల్ సుభద్రాదేవి మాట్లాడుతూ, సినీనటుడు నాగబాబు కుటుంబ సభ్యుల తరపున జూకు చిలుకల జంటను కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా అందజేయడం సంతోషకరమన్నారు. నాగబాబుని స్పూర్తిగా తీసుకుని జూలో జంతువులను, పక్షులను దత్తత తీసుకోవడానికి మరికొంత మంది ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి క్యూరేటర్ నాగమణితో పాటు అసిస్టెంట్ క్యూరేటర్లు , పీఆర్ఓ హనీపుల్లా, తదితర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.