బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం: నాదెండ్ల

by  |
బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం: నాదెండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉందని.. జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. కరోనా మహమ్మరితో ప్రపంచం కుదేలైన సమయంలో, మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై నాదెండ్ల హర్షం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 2 లక్షల 23 వేల కోట్లు కేటాయించారని.. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించడంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు.

Next Story

Most Viewed