మొక్కలు నాటిన ఇస్మార్ట్ భామ

by  |
మొక్కలు నాటిన ఇస్మార్ట్ భామ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీ్కరించింది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి స్ఫూర్తి పొందిన తాను.. ఈ చాలెంజ్ స్వీకరించినట్లు తెలిపింది. బెంగుళూరులోని తన నివాసంలో మొక్కలు నాటిన భామ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనూ ఇమ్మాన్యూయల్, నిధి అగర్వాల్‌ను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్‌కు థాంక్స్ చెప్పింది. కాగా నభా ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్‌లో నటిస్తుంది. దీంతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Next Story