సంచలనం: డబ్బు కోసం స్నేహితుడిని కత్తులతో పొడిచి..

by  |
సంచలనం: డబ్బు కోసం స్నేహితుడిని కత్తులతో పొడిచి..
X

దిశ, చార్మినార్​ : అప్పుగా తీసుకున్న డబ్బులు ఇస్తానని స్నేహితున్ని ఇంటికి పిలిచి అతికిరాతకంగా కత్తులతో హతమార్చిన ఘటన కాలాపత్తర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. కాలాపత్తర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్​ బిలాల్​‌నగర్​కు చెందిన సాధిక్​(40) వద్ద నుంచి గత కొంత కాలం క్రితం అక్సా మసీదు ప్రాంతానికి చెందిన స్నేహితుడు సాధిక్​ యమానితో పాటు మరో ఇద్దరు రూ.8లక్షల నగదు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్న సాధిక్​ యమానితో పాటు మరో ఇరువురిని సాధిక్ తన డబ్బులు తనకు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగాడు.

ఈ నేపథ్యంలో డబ్బుల విషయం మాట్లాడుదామని సాధిక్​ యమాని ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో సాధిక్ ను పిలిచాడు. అప్పటికే ఇంట్లో మరో ఇద్దరితో ఉన్న సాధిక్​ యమానితో డబ్బుల విషయంలో సాధిక్​తో వివాదం తలెత్తింది. వారిరువురి మధ్య మాటామాటా పెరగడంతో సాధిక్​ యమాని కత్తులతో సాధిక్​పై దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న కాలాపత్తర్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును కాలాపత్తర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story