- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చార్మినార్ : అప్పుగా తీసుకున్న డబ్బులు ఇస్తానని స్నేహితున్ని ఇంటికి పిలిచి అతికిరాతకంగా కత్తులతో హతమార్చిన ఘటన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. కాలాపత్తర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ బిలాల్నగర్కు చెందిన సాధిక్(40) వద్ద నుంచి గత కొంత కాలం క్రితం అక్సా మసీదు ప్రాంతానికి చెందిన స్నేహితుడు సాధిక్ యమానితో పాటు మరో ఇద్దరు రూ.8లక్షల నగదు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్న సాధిక్ యమానితో పాటు మరో ఇరువురిని సాధిక్ తన డబ్బులు తనకు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగాడు.
ఈ నేపథ్యంలో డబ్బుల విషయం మాట్లాడుదామని సాధిక్ యమాని ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో సాధిక్ ను పిలిచాడు. అప్పటికే ఇంట్లో మరో ఇద్దరితో ఉన్న సాధిక్ యమానితో డబ్బుల విషయంలో సాధిక్తో వివాదం తలెత్తింది. వారిరువురి మధ్య మాటామాటా పెరగడంతో సాధిక్ యమాని కత్తులతో సాధిక్పై దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును కాలాపత్తర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.