- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దండేపల్లి : సమాజంలో వివాహేతర సంబంధాలు రాను రాను ఎక్కువ అవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న అక్రమ సంబంధాలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఏకంగా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి రాగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
వివరాల్లోకివెళితే.. జిల్లాలోని దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన ప్రవీణ్ (35) అనే వ్యక్తి అదే గ్రామంలో ఉంటున్న ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఆ విషయం కాస్త ఆ మహిళ కొడుకు పవన్ కళ్యాణ్కు తెలిసిపోయింది. ఇలాంటివి మానుకోవాలని తల్లితో పాటు ప్రవీణ్ను కూడా పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రవీణ్ ఆమె ఇంటికి వెళ్లి తన బిజీలో తాను ఉండగా.. అదే టైంకు మహిళ కొడుకు పవన్ కళ్యాణ్ వచ్చాడు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఆ ఇంటి నుంచి పారిపోతుండగా వెంబడించిన పవన్ కళ్యాణ్ అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాల్, లక్షెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.